Amaravati: ఏపీ రాజధాని మార్పు ప్రతిపాదనలపై వివరాలను అడిగిన మోదీ కార్యాలయం

  • గవర్నర్ వద్దకు చేరిన రాజధాని, సీఆర్డీయే బిల్లులు
  • పీఎంవోకు పంపిన ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి
  • గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగిన పీఎంవో
PMO asks details of AP Capital Bill

మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. మరోవైరు, ఈ బిల్లులకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఆరా తీయడం గమనార్హం. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను కోరింది. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది.

More Telugu News