Jahnavi Kapoor: చిరంజీవి 'ఆచార్య'లో మరో హీరోయిన్!

  • 'ఆచార్య'లో గెస్ట్ పాత్రలో రామ్ చరణ్
  • తమన్నాకు డేట్స్ సమస్య
  • జాన్వీతో సంప్రదిస్తున్న చరణ్
  • రామోజీ ఫిలిం సిటీలో దేవాలయం సెట్
Another heroine in Acharya movie

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య' గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మరో కథానాయికగా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించే చాన్స్ వుందని టాలీవుడ్ లో తాజాగా ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గెస్ట్ పాత్ర లాంటి కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు. ఆయన సరసన నటించడానికి ఇప్పటికే తమన్నాను మాట్లాడివుంచారు. అయితే, ఆమెకు డేట్స్ సమస్య వస్తుండడంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీ అయితే ఫ్రెష్ గా ఉంటుందన్న భావనతో చరణ్ ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

రామోజీ ఫిలిం సిటీలో దేవాలయం సెట్:


ఈ చిత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి కార్యకలాపాలపై దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఓ పురాతనమైన దేవాలయం సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇక చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెజీనా ఓ ఐటం పాటలో కనిపిస్తుంది.

More Telugu News