Currency: కర్నూలు జిల్లా చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద రూ.1 కోటి 80 వేల నగదు పట్టివేత

  • హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న కారు
  • నగదుకు పత్రాలు లేని వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Cash seize at a toll plaza in Kurnool district

ఇటీవలే తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఈ వ్యవహారంలో బాగా వినిపించింది. ఆ తర్వాత ఆ డబ్బు తనదేనంటూ ఒంగోలుకు చెందిన జ్యూయెలరీ షాపు యజమాని పోలీసులకు చెప్పాడు.

ఆ విషయం అటుంచితే, అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ వాహనంలో రూ.1 కోటి 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళుతున్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసిన అనంతరం కేసు నమోదు చేశారు.

More Telugu News