Tirumala: లాక్ డౌన్ తరువాత... తిరుమలలో పెరిగిన రద్దీ, హుండీ ఆదాయం!

  • 8,068 మందికి దర్శనం
  • తలనీలాలు సమర్పించిన 2,730 మంది
  • హుండీ ద్వారా రూ. 32 లక్షల ఆదాయం
Piligrims Rush Risen in Tirumala

లాక్ డౌన్ తరువాత పరిమితంగా భక్తులకు దర్శనాలను అనుమతిస్తున్న వేళ, తిరుమలలో బుధవారం నాడు రద్దీ పెరిగింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారు కూడా కరోనా భయంతో స్వామి దర్శనానికి వచ్చేందుకు సుముఖంగా లేని సమయంలో, బుధవారం నాడు ఏకంగా 8,068 భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,730 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. లాక్ డౌన్ అనంతరం దర్శనాలను పునరుద్ధరించిన తరువాత రూ. 32 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

More Telugu News