చేజారుతున్న పరిస్థితి.. పూణెలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్
- పూణె పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజు 1,803 కేసులు
- జిల్లాలో 974కు పెరిగిన కరోనా మరణాలు
- ఈనెల 13 నుంచి ఫుల్ లాక్ డౌన్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కు సంబంధించిన పూర్తి ఆర్డర్ ను విడుదల చేస్తామని పూణె డివిజనల్ కమిషనర్ దీపక్ తెలిపారు.
పూణెతో పాటు పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే 1,803 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 34,399 కేసులు నమోదయ్యాయి. పూణె జిల్లాలో ఇప్పటి వరకు 974 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,000 దాటాయి. ఇదే సమయంలో మరణాలు 219కి చేరుకున్నాయి.