కరోనా కేసుల్లో టాప్-3 స్థానానికి ఎగబాకిన ఇండియా!
- రష్యాలో 6.8 లక్షల కేసులు
- నిన్నటితో ఇండియాలో 6.9 లక్షల కేసులు
- ఇండియాకన్నా ముందు యూఎస్, బ్రెజిల్
గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తరువాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.