Venkaiah Naidu: 'ఎలిమెంట్స్' యాప్ ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

  • చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం
  • దేశీయ యాప్ లకు ప్రోత్సాహం
  • తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా 'ఎలిమెంట్స్' కు గుర్తింపు
Venkaiah Naidu launches Elyments App

చైనాతో గాల్వన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు మరణించడం దేశవ్యాప్తంగా జాతీయతా భావాన్ని పురికొల్పింది. ఇది చైనాపైనా, చైనా ఉత్పత్తులపైనా వ్యతిరేకతకు దారితీసింది. ఈ క్రమంలో చైనా యాప్ లను ప్రభుత్వమే నిషేధించడంతో స్వదేశీ ఉత్పత్తులు, దేశీయ సాంకేతికతను బలంగా ప్రోత్సహించినట్టయింది. అనేక దేశీయ యాప్ లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో, 'ఎలిమెంట్స్' అనే యాప్ కూడా రంగంలోకి దిగింది.

ఈ సోషల్ మీడియా యాప్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. 'ఎలిమెంట్స్' యాప్ ద్వారా యూజర్లు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పర్సనల్, గ్రూప్ చాట్ చేసుకోవడానికి వీలవుతుంది. మున్ముందు కాన్ఫరెన్స్ కాల్స్, డిజిటల్ చెల్లింపులు కూడా ఈ యాప్ లో పొందుపరచనున్నారు. ఈ యాప్ ను ఇప్పటికే లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ రూపకల్పనలో వందల సంఖ్యలో ఐటీ నిపుణులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్లు పాలుపంచుకున్నారు.

More Telugu News