Corona Virus: ఏపీలో మరో 706 మందికి సోకిన కరోనా

  • గత 24 గంటల్లో 30,216 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసులు 11,554
  • ఆసుపత్రుల్లో కరోనాకు 6,387 మందికి చికిత్స
  • ఇప్పటివరకు 4,987 మంది డిశ్చార్జ్  
coronavirus cases in ap

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించగా మరో 706 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 302 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 11,554 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 13,891 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,387 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 4,987  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 180కి చేరింది.    

            

More Telugu News