Corona Virus: దేశంలో 5,48,318కి చేరిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా
  • మొత్తం మృతుల సంఖ్య 16,475
  • 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స 
  • కోలుకున్న వారు 3,21,723 మంది 
380 deaths and 19459 new COVID19 cases in last 24 hours

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 380 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు.

కాగా, జూన్‌ 28 వరకు దేశంలో మొత్తం 83,98,362 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో  1,70,560 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

More Telugu News