Tirumala: ఏకాంత సేవ తర్వాత నేటి రాత్రికి శ్రీవారి ఆలయం మూత.. రేపు భక్తులకు దర్శనం బంద్

  • రేపు ఉదయం 10:18 నుంచి 1:38 వరకు గ్రహణం
  • ఏకాంత సేవ తర్వాత నేటి రాత్రికి ఆలయం మూత
  • తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు తెరుచుకోనున్న ఆలయం
Tirumala temple closed today night due to solar eclipse

సూర్యగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూతబడనుంది. నేటి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు సూర్యగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం రోజువారి కైంకర్యాలు నిర్వహించి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తామని, కైంకర్యాల నిర్వహణలో భాగంగా రేపు భక్తులకు దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

More Telugu News