petrol: 12 రోజుల్లో రూ.6.55 పెరిగిన పెట్రోలు ధర

petrol rates in india
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 53 పైసలు, డీజిల్‌పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. 12 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.6.55, డీజిల్‌ ధర రూ.7.04 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.81కి, డీజిల్ ధర రూ.76.43కి చేరింది.

ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.84.66కి, డీజిల్‌ 74.93కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.32, డీజిల్ ధర రూ.74.23గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.79.59, డీజిల్ ధర రూ.71.96గా ఉంది.
petrol
India

More Telugu News