petrol: 12 రోజుల్లో రూ.6.55 పెరిగిన పెట్రోలు ధర

  • పెట్రోలుపై లీటరుకు నేడు 53 పైసల పెంపు
  • డీజిల్‌పై లీటరుకు 64 పైసలు పెరుగుదల
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.81
  • డీజిల్ ధర రూ.76.43
petrol rates in india

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 53 పైసలు, డీజిల్‌పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. 12 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.6.55, డీజిల్‌ ధర రూ.7.04 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.81కి, డీజిల్ ధర రూ.76.43కి చేరింది.

ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.84.66కి, డీజిల్‌ 74.93కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.32, డీజిల్ ధర రూ.74.23గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.79.59, డీజిల్ ధర రూ.71.96గా ఉంది.

More Telugu News