AP Cabinet: ఏపీ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

ap cabinet meets
  • బడ్జెట్ తీర్మానానికి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
  • ఈ భేటీ తర్వాత సమావేశం కానున్న శాసన సభ, మండలి
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్ తీర్మానానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఈ భేటీ తర్వాత శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాల్‌ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగించనున్నారు.

ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జులై నుంచి రాబోయే తొమ్మిది నెలల కాలం కోసం పూర్తిస్థాయి బడ్జెట్ ను ఇప్పుడు ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
AP Cabinet
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News