Vijay Sai Reddy: అందుకే గత ప్రభుత్వ హయాంలో అవినీతిని ప్రోత్సహించారు: విజయసాయిరెడ్డి

  • అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ,  పరిటాల, నారాయణ
  • ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్నారు
  • ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు వెళ్లాయి
  • ఇప్పుడు అమాయకుల్లా నాటకాలాడుతున్నారు 
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు పట్ల ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

'అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ,  పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు ముడుపులుగా వెళ్లాయి. అందుకే అవినీతిని ప్రోత్సహించారు. ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

More Telugu News