Corona Virus: కరోనా అప్ డేట్: 24 గంటల వ్యవధిలో తెలంగాణలో 14 మంది మృతి

Fourteen people dies of corona in Telangana
  • ఇప్పటివరకు 137 మంది కరోనాతో కన్నుమూత
  • రాష్ట్రంలో కొత్తగా 154 పాజిటివ్ కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 132 మందికి కరోనా
తెలంగాణలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 14 మంది కన్నుమూశారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 137కి పెరిగింది. కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 132 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,650కి పెరిగింది. ఇక, కరోనా నుంచి కోలుకుని 1,742 మంది డిశ్చార్జి కాగా, 1,771 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Telangana
Deaths
Positive
GHMC
COVID-19

More Telugu News