Jammu And Kashmir: కశ్మీర్ లోయలో భారత భద్రతా బలగాలకు ఘనవిజయం... ఐదుగురు మిలిటెంట్ల హతం

  • షోపియాన్ జిల్లాలో ఘటన
  • మిలిటెంట్ల సమాచారంతో చుట్టుముట్టిన జవాన్లు
  • పారిపోయే క్రమంలో కాల్పులు జరిపిన మిలిటెంట్లు
Indian armed forces kills five militants

ఇటీవల కాలంలో కశ్మీర్ లోయలో భారత భద్రతా దళాలకు ఘనవిజయం దక్కింది. షోపియాన్ జిల్లాలోని రిబాన్ వద్ద భారత జవాన్లు ఐదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టారు. రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జవాన్ల రాకతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరి కాల్పులను దీటుగా ఎదుర్కొన్న భారత దళాలు ఐదుగురినీ అంతమొందించాయి. అయితే వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది.

More Telugu News