Andhra Pradesh: 16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, 18న బడ్జెట్!

  • 16న గవర్నర్ ప్రసంగం
  • 19న రాజ్యసభ ఎన్నికలు
  • తక్కువ రోజులు జరగనున్న అసెంబ్లీ
Andhrapradesh Assembly Session From 16

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్‌ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా, 18న బడ్జెట్ సభ ముందుకు రానుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది. ఆపై 19 వ తేదీన ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా విస్తరణ నేపథ్యంలో సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News