Crime News: అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని.. యువకుడిని సజీవ దహనం చేసిన వైనం

  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కలకలం 
  • యువకుడి ఇంటికొచ్చి ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసిన వైనం
  • యువకుడి మృతితో అతడి బంధువుల ఆందోళన
  • పోలీసు వాహనాలకు నిప్పు
man kills in up

ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కలకలం రేపింది. భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే యువకుడు  ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ మహిళకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు.

దాన్ని చూసిన ఆ మహిళ బంధువులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. తమ వర్గానికి చెందిన మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆ మహిళ బంధువులు ఈ రోజు ఉదయం ఆ యువకుడిని ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి నిరసనకు దిగి, పోలీసు వాహనాలను దగ్ధం చేయడం అలజడి రేపింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను పిలిపించారు.

More Telugu News