Narendra Modi: ఈ పోరాటంలో మన వైద్య సిబ్బందే గెలుస్తారు: కరోనా ఉద్ధృతిపై మోదీ వ్యాఖ్యలు

  • కరోనా వైరస్‌ కంటికి కనపడని శత్రువు అయి ఉండొచ్చు
  • వైరస్‌ను అంతమొందించేందుకు పోరాటం చేస్తోన్న యోధులు అజేయులు
  • కంటికి కనపడని శత్రువు, అజేయులకు మధ్య జరుగుతోంది పోరాటం
Virus May Be Invisible Enemy But Our Corona Warriors Are Invincible

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయంపై స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'కరోనా వైరస్‌ కంటికి కనపడని శత్రువు అయి ఉండొచ్చు. కానీ, కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు పోరాటం చేస్తోన్న యోధులు, వైద్య సిబ్బంది అజేయులు. కంటికి కనపడని శత్రువు, అజేయులకు మధ్య జరుగుతోన్న ఈ పోరాటంలో మన వైద్య సిబ్బందే గెలుస్తారు' అని మోదీ చెప్పారు.

కాగా, మోదీ నేతృత్వంలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

More Telugu News