Telangana: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం... లాక్ డౌన్ నిబంధనలు సడలింపు

  • ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షల ఎత్తివేత
  • జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితి కొనసాగింపు
  • రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
Telangana loosens lock down restrictions

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలకు రాత్రి 8 గంటల వరకే అనుమతించారు. ఈ మేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,  జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

More Telugu News