నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం: ఏపీ అడ్వొకేట్ జనరల్
- నిమ్మగడ్డ అంశంలో ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు
- సుప్రీంను ఆశ్రయించే వరకు స్టే ఇవ్వాలన్న ఏపీ సర్కారు
- నిమ్మగడ్డ నియామకంలోనే ఉల్లంఘనలు ఉన్నాయన్న ఏజీ
తాము సుప్రీంను ఆశ్రయించేవరకు నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇవ్వాలని హైకోర్టును కోరామని చెప్పారు. ఈ విషయాన్ని పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ లో స్పష్టత కోసం సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నియామకంలోనే చట్టపరమైన ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపించారు.