Neelam Sahni: హైకోర్టుకు హాజరైన ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని

  • కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో కోర్టుకు హాజరైన సీఎస్
  • ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న హైకోర్టు
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా
AP CS Neelam Sahni attends High Court hearing

ప్రభుత్వ  కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసిన అంశాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. రంగులు తొలగించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, వైసీపీ రంగులకు తోడు మట్టి రంగును ప్రభుత్వం కలిపింది. ఈ అంశంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను కోర్టుకు రమ్మని పిలిచింది. దీంతో, వీరిద్దరూ ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఏపీ డీజీపీ కూడా ఇటీవల హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.

More Telugu News