హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు చంద్రబాబు దరఖాస్తు... ఓకే చెప్పిన తెలంగాణ, పెండింగ్ లో పెట్టిన ఏపీ!
- మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు
- ఆపై లాక్ డౌన్ తో అప్పటి నుంచి భాగ్యనగరిలోనే
- గ్యాస్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తాను
- ఏపీ, టీఎస్ డీజీపీలను అనుమతి కోరిన చంద్రబాబు
తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. కాగా, మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారన్న సంగతి తెలిసిందే. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు. విశాఖలో బాధితులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటానని తెలిపారు.