చట్టాన్ని గౌరవించని ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్న న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్
- ఇవాళ హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బలు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పుల సంఖ్య మరింత పెరిగిందని వెల్లడి
- ఇవాళ మరో 3 తీర్పులు జత కలిశాయని వ్యాఖ్యలు
ఇప్పటికైనా తాము అనుసరిస్తున్న పంథా సరైనది కాదని వైసీపీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. కుట్ర రాజకీయాలు, ప్రతీకార ధోరణులతో వ్యవహరిస్తున్నారని, ఇలాంటి నిర్ణయాలు, చర్యల ద్వారా అధికార పక్షం ఎంతో విలువైన న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తోందని, పన్ను చెల్లింపుదారుల ధనాన్ని కూడా వృథా చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా, ఏపీ ప్రజల వాస్తవిక సంక్షేమం, అభివృద్ధిని కాలరాస్తోందని విమర్శించారు.