nagababu: అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను: మంత్రి అవంతికి నాగబాబు చురక

  • అవంతి శ్రీనివాసరావుపై మండిపడ్డ నాగబాబు
  • పద్మనాభపురంలో ఇటీవల మంత్రి అవంతి నిద్ర
  • గ్యాస్ లీక్ బాధితులకు భరోసా
  • ఆ సందర్భంగా ఆవుకు గడ్డి తినిపించిన మంత్రి
nagababu about avanti

'అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను' అంటూ జనసేన నేత నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి సంబంధించిన ఓ ఫొటో పోస్ట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో అవంతి శ్రీనివాసరావు ఓ ఆవుకు గడ్డి తినిపిస్తోంటే అది తినకుండా అలాగే చూస్తూ నిలబడినట్లు ఉంది.
                
విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రజలకు భరోసా కల్పించేందుకు పద్మనాభపురంలో ఇటీవల మంత్రి అవంతి నిద్ర చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రజలకు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన ఈ ఆవుకు గడ్డి తినిపిస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఫొటోలు దిగి పోస్ట్ చేశారు. అందులోని ఓ ఫొటోను నాగబాబు ఈ రోజు పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News