KTR: లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంటాం: కేటీఆర్ ప్రకటన

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు
  • వాటి అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి
  • కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు
  • అన్ని సూచనలను మేము పరిశీలిస్తాం 
ktr on lock down

కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి నుంచి దేశ వ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్‌ అమలవుతుండగా తెలంగాణలో మూడో దశ లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన అంశాలను తెలంగాణలోనూ అమలు చేయడం వంటి పలు కీలక అంశాలపై ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు.

'లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల అమలుపై మాకు చాలా సూచనలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇదే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సూచనలను మేము పరిశీలిస్తాం' అని తెలిపారు. సడలింపులపై అందరి సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

More Telugu News