కరోనాపై విజయం దిశగా... ఒక్కరోజులో పంజాబ్ లో952, తమిళనాడులో 939 మంది డిశ్చార్జ్!
- ఇండియాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- ఇదే సమయంలో పెరుగుతున్న రికవరీలు
- కోలుకున్నవారికి విందు ఏర్పాటు చేసిన పంజాబ్ ఎమ్మెల్యే
ఇక తమిళనాడు విషయానికి వస్తే, కొత్తగా 477 కేసులు నమోదు కాగా, శనివారం నాడు 939 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంతవరకూ 10,585 కేసులు నమోదు కాగా, 3,538 మంది రికవరీ అయ్యారు. మరో 6,970 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 74 మంది మరణించారు. కొత్త కేసుల్లో ఒక్క చెన్నైలోనే 332 కేసులు రాగా, తిరువళ్లూరు జిల్లాలో 10, చంగల్పేటలో 13, కాంచీపురంలో 4 కేసులు వచ్చాయి. వీరిలో కొందరు ఢాకా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులని అధికారులు తెలిపారు.