COVID-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో మరో 3,525 మందికి సోకిన వైనం

  • గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,415
  • మొత్తం కేసులు 74,281
  • కోలుకున్న 24,386 మంది
Spike of 3525  COVID19 cases and 122 deaths in the last 24 hours total positive cases in the country is now at 74281

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,415కి చేరింది.

ఇక గత 24 గంటల్లో దేశంలో 3,525 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 74,281కి చేరింది. అలాగే, కరోనా నుంచి 24,386  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 47,480 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News