ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం జగన్ అసమర్ధతకు నిదర్శనం: బోండా ఉమ
- లాక్ డౌన్ తో కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం మోపుతారా?
- పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి
- లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం
ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచడం సీఎం జగన్ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను చంద్రబాబు పెంచలేదని అన్నారు. లాక్ డౌన్ తో పనులు లేక కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం మోపుతారా? అని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ బిల్లులను రద్దు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.