shamshabad: విదేశాల నుంచి శంషాబాద్ చేరుకున్న ఏపీ వాసుల ఇబ్బందులు!

  • హైదరాబాద్ లోనే  క్వారంటైన్ చేస్తామన్న తెలంగాణ  
  • దీంతో, అక్కడే ఏపీ వాసులు ఉండాల్సిన పరిస్థితి
  • పెయిడ్ క్వారంటైన్ మాత్రమే కల్పిస్తున్న  ప్రభుత్వం

విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ వాసులకు ఇబ్బందులు తలెత్తినట్టు సమాచారం. హైదరాబాద్ లోనే క్వారంటైన్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఏపీ వాసులు హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందులోనూ పెయిడ్ క్వారంటైన్ సదుపాయాన్ని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది.

కాగా, ఏపీకి చెందిన వారికి వెసులు బాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ వాసులు ఉన్న విమానాలను నేరుగా విశాఖ, తిరుపతి, విజయవాడకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News