Kesineni Nani: జగన్ గారూ, బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకూ కోటి నష్టపరిహారం ఇస్తే బాగుండేది: టీడీపీ ఎంపీ కేశినేని

  • విశాఖ ఘటనలో రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించారు
  • ప్రజలందరినీ సమానంగా చూడండి
  • ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం వద్దు
TDP MP Kesineni Nani tweet

విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎంపీ కేశినేని ఓ సూచన చేశారు. గతంలో గోదావరి నది బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కూడా కోటి రూపాయలు ఇచ్చి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఆ కుటుంబాలకు బ్యాలన్స్ అమౌంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజలందరినీ సమానంగా చూడాలి గానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండకూడదని అన్నారు.

More Telugu News