Corona Virus: ఇండియాలో 50 వేల మార్క్ దాటిన కరోనా కేసులు

  • 50,545కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • మూడు రోజుల్లో కొత్తగా 10 వేల కేసులు
  • 1,650 దాటిన మృతుల సంఖ్య
Corona cases in india crosses 50000

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్క్ ను దాటాయి. కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఈ మార్క్ ను భారత్ దాటింది. మొత్తం కేసుల సంఖ్య 50,545కి చేరుకుంది. గత మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 10 వేల కేసులు నమోదయ్యాయి. ఇండియాలోని మొత్తం కేసుల్లో 16,758 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ ఒక్కరోజే కొత్తగా 1,233 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ 6,200కు పైగా కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,650 దాటింది.

More Telugu News