మోదీ నాయకత్వం భళా... ప్రజల్లో మరింత పెరుగుతున్న నమ్మకం.. వెల్లడించిన సర్వేలు!
- కరోనా కష్టకాలంలో దృఢంగా నిలిచిన మోదీ
- మహమ్మారిపై పోరులో కేంద్రకంగా నిలిచిన వైనం
- అత్యంత కష్టకాలంలోనూ ఇతర దేశాలకు సాయం
ఐఏఎన్ఎస్-సీఓటర్ చేపట్టిన అధ్యయనంలోనూ ఇలాంటి సమాచారమే వెల్లడైంది. మార్చి 25న మోదీ నాయకత్వంపై ఉన్న విశ్వసనీయత 76.8 శాతం కాగా, ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి చేరింది. మార్చి నెలారంభం నాటికి దేశంలో కరోనా కొద్దిస్థాయిలోనే ఉంది. ఆ సమయంలో దేశంలో ఆర్థిక రంగం మందగమనంలో సాగుతోంది. ఢిల్లీ వీధులు మతకల్లోలాలతో అట్టుడికాయి.
అయితే కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యేకొద్దీ ప్రధాని మోదీ ప్రాభవం మరింత హెచ్చింది. ప్రజల కోసం ఆయన దృఢంగా నిలిచిన తీరు ఆదరణను మరింత పెంచింది. వైరస్ మహమ్మారిపై పోరాటంలో ఆయన కేంద్రకంగా నిలిచారు. పైగా, అత్యంత కష్టకాలంలోనూ ప్రపంచ దేశాలకు సాయపడడం కూడా మోదీ ఛరిష్మాను ఇతోధికంగా పెంపు చేసింది.