కేంద్ర ఐటీ మంత్రికి నా అభిప్రాయం చెప్పాను: మంత్రి కేటీఆర్

Minister KtR Participated and spoke in the Video conference chaired by Union IT Ministe
  • కేంద్ర ఐటీ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
  • ఈ కాన్ఫరెన్స్ లో నేను పాల్గొన్నాను
  • ఈ ప్రతికూలత గొప్ప అవకాశాలను అందిస్తుందన్న కేటీఆర్
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తాను పాల్గొన్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రతికూలత గొప్ప అవకాశాలను అందిస్తుందన్న తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచానని చెప్పారు. ‘కరోనా’ బారి నుంచి బయటపడే ప్రపంచానికి సాంకేతిక పరిష్కారాలను త్వరగా అభివృద్ధి చేసే సత్తా భారతదేశానికి ఉందని, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చెబుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
KTR
TRS
Telangana
central
IT Minister
RS Prasad

More Telugu News