Nani: అటకెక్కిన నాని, రాహుల్ సినిమా?

  • నాని తాజా చిత్రంగా రానున్న 'వి'
  • తదుపరి సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్'
  • ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ఫిల్మ్ నగర్ టాక్  
Shyam Singh Roy Movie

నాని తాజా చిత్రంగా 'వి' ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా, ఆ తరువాత థియేటర్స్ కి రానుంది. ఆ తరువాత సినిమాను రాహుల్ దర్శకత్వంలో నాని చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి, 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనీ, పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఏడాది పాటు థియేటర్స్ కి జనాలు రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న కారణంగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News