Yanamala: జగన్ ది సున్నా పరిపాలన: టీడీపీ నేత యనమల
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ ది సున్నా వడ్డీ కాదు, సున్నా పరిపాలన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీని జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ పథకం అమలు చేశామని గుర్తుచేశారు.