'ఆచార్య' విషయంలో అలా ప్లాన్ చేసిన కొరటాల
- కొరటాల నుంచి 'ఆచార్య'
- లాక్ డౌన్ కారణంగా జరుగుతున్న ఆలస్యం
- కాజల్ పోర్షన్ పక్కన పెట్టేసిన కొరటాల
ముంబైలో వున్న కాజల్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. అందువలన కాజల్ కాంబినేషన్ సీన్స్ ను పక్కన పెట్టేసి, ఇక్కడి ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ను సెట్స్ లో చిత్రీకరించాలనే నిర్ణయానికి కొరటాల వచ్చాడని అంటున్నారు. పరిస్థితులు కుదురుకున్న తరువాత కాజల్ పై సన్నివేశాలను చిత్రీకరించాలని ఆయన భావిస్తున్నాడట. షూటింగు మరీ ఆలస్యమైతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన అలా ప్లాన్ చేశాడని అంటున్నారు.