Anitha: మహిళలను ఆదుకుంటామంటూ సీఎం జగన్ మాయమాటలు చెబుతున్నారు: టీడీపీ నేత అనిత

  • సున్న వడ్డీ  పేరిట డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది
  • వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగలడం ఖాయం
  • లాక్ డౌన్ నిబంధనలను రోజా ఉల్లంఘించారు
TDP Leader Anitha criticises CM Jagan

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత అనిత విమర్శలు గుప్పించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి కానీ, పనులు మాత్రం గడప దాటట్లేదు అన్న చందంగా ఈ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.

ఎన్నికలకు ముందు మహిళలను ఆదుకుంటామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ మాటను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సున్న వడ్డీ పథకం పేరిట డ్వాక్రా మహిళలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగలడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆమె విమర్శలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఆమె ఉల్లంఘించారని అన్నారు.

More Telugu News