Vijay: 'ఉప్పెన' తమిళ రీమేక్ లో హీరోగా విజయ్ తనయుడు

  • తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉప్పెన'
  • తమిళ రీమేక్ హక్కులు విజయ్ సేతుపతి చేతికి
  • కొడుకును హీరోగా పరిచయం చేసే ఆలోచనలో విజయ్
Vijay

తెలుగులో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' నిర్మితమైంది. బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాలో కథానాయిక తండ్రిగా .. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 2వ తేదీనే విడుదల కావలసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా కథాకథనాలు నచ్చడంతో, తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. హీరో విజయ్ మంచి టీనేజ్ లవ్ స్టోరీ దొరికితే తన తనయుడు జాసన్ సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. ఆ విషయం తెలిసిన విజయ్ సేతుపతి, ఈ కథను గురించి విజయ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో తను చేసిన పాత్రనే తమిళంలోను విజయ్ సేతుపతి చేయనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News