P Narayana: ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు మాతృ వియోగం

  • ఉదయం తుదిశ్వాస విడిచిన తల్లి సుబ్బమ్మ
  • ఆమె వయసు 85 సంవత్సరాలు
  • ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు
TDP leader P Narayana mother died

టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఇంట విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సుబ్బమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ సందర్భంగా నారాయణకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు టీడీపీ నేతలు కూడా సంతాపాన్ని ప్రకటించారు. సుబ్బమ్మ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.

More Telugu News