Chandrababu: విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పింఛన్ చెల్లించాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

  • ‘కరోనా’ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
  • వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి
  • వారికి వైద్య ఖర్చులు ఉంటాయి కనుక మొత్తం పింఛన్ ఇవ్వాలి
Chandrababu writes a letter to CM Jagan

‘కరోనా’ నేపథ్యంలో ఏపీలోని విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన వారిపై ఈ తరహా చర్యలు సబబు కాదని, వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని అన్నారు.

పింఛన్ అందుకునే వాళ్లందరూ 60 ఏళ్లకు పైబడిన వారేనని, ఈ వయసు వారికి ‘కరోనా’ వ్యాపించే అవకాశాలు అధికం అని, వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

More Telugu News