UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదా... కొత్త తేదీ మే 3 తర్వాత వెల్లడించనున్న కేంద్రం

  • మే 31న ప్రిలిమ్స్
  • మే 3 వరకు దేశంలో లాక్ డౌన్
  • కరోనా ప్రభావంతో ప్రిలిమ్స్ మరొక రోజు నిర్వహించాలని నిర్ణయం
UPSC Prelims new date will be announced after lock down

కరోనా ప్రభావం యూపీఎస్సీ పరీక్షలపైనా పడింది. దేశంలోని అత్యున్నత సర్వీసుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారుల ఎంపిక కోసం నిర్దేశించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్-2020 వాయిదా పడింది. ఈ పరీక్షలు వాస్తవానికి మే 31న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. దాంతో ఈ పరీక్ష నిర్వహణను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. మే 3 తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ కొత్త తేదీలను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

More Telugu News