Telangana: తెలంగాణలో జరగాల్సిన ప్రవేశపరీక్షలన్నీ వాయిదా వేస్తూ ప్రకటన

  • లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం
  • ఎంసెట్ సహా వచ్చే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు
  • ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన
All Entrance exams are postponed

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా  పడ్డాయి. ఎంసెట్ సహా వచ్చే నెలలో జరగాల్సిన అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆయా ప్రవేశ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 

More Telugu News