అర్చకులకు ఆర్థిక సాయంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- చిన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు ఆర్థిక సాయం
- ఒక్కొక్కరికి రూ. 5 వేల సాయం
- జగన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి వెల్లంపల్లి
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులను ఆదుకోవాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 14 వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించమని తెలిపారు. ఆలయాల్లో ప్రతి రోజు నిత్య పూజలు జరుగుతున్నాయని చెప్పారు.