హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కలకలం.. కరోనా బాధితుడు పరారైనట్లు గుర్తింపు

corona affected patient runaway
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యులు
  • గద్వాలకు చెందిన ఈ వ్యక్తికి కరోనా
  • వారం రోజు క్రితం ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులో చేరిక
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా బాధితుడు ఒకరు పరారయ్యారన్న సమాచారం స్థానికంగా కలకలానికి కారణమైంది. గద్వాలకు చెందిన ఈ వ్యక్తి కరోనా బారిన పడినట్లు గుర్తించడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రికి తెచ్చి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అప్పటి నుంచి ఇక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు వైద్య సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లు  నిన్నరాత్రి గుర్తించారు. ఈ సమాచారం ఆసుపత్రి వర్గాల్లో కలకలానికి కారణమైంది. వెంటనే తేరుకున్న ఆసుపత్రి వైద్యాధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.
Go Back to Shorts
Hyderabad
Gandhi Hospital
carona patient

More Telugu News