Corona Virus: కరోనా అలర్ట్: ఏపీలో కొత్తగా మరో 3 కేసులు

  • ఏపీలో కరోనా ఉద్ధృతం
  • 135కి చేరిన కేసుల సంఖ్య
  • రాష్ట్రంలో మరో రెండు చోట్ల కరోనా ల్యాబ్ ల ఏర్పాటు
Three more corona positive cases in AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఉద్ధృతమవుతోంది. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు, కడపలో కూడా కరోనా నిర్ధారణ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. గుంటూరులోని కరోనా పరీక్షల కేంద్రం రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుండగా, కడపలోని ల్యాబ్ ఎల్లుండి నుంచి పని ప్రారంభించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయి.

More Telugu News