Gowtam sawang: తమ విరాళాన్ని ప్రకటించిన ఏపీ ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌

  • కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం విరాళం
  • మూడు రోజుల వేతనం విరాళంగా ప్రకటన
  • సీఎం జగన్ ని కలిసిన అసోసియేషన్ సభ్యులు 
AP IPS Officers Association donation to CM Relief fund

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సాయమందించింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లోని సభ్యులు తమ మూడు రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేస్తూ, సంబంధిత పత్రాన్ని ఆయనకు అందజేశారు. 

More Telugu News