Pawan Kalyan: ఈ మహిళ చెబుతున్న విషయంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి: పవన్ కల్యాణ్

  • లాక్ డౌన్  తో పనులు లేక  మా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం
  • పనులు లేకపోవడంతో తిండి కూడా దొరకట్లేదు
  • ఓ నెల క్రితమే బిడ్డను ప్రసవించానన్న ఓ మహిళ 
  • ఆ వీడియోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్
Pawan kalyan request AP govt abd Kurnool district Parliamentarians

లాక్ డౌన్ నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఓ నెల క్రితం బిడ్డను ప్రసవించిన ఓ మహిళ ఏకరవు పెట్టింది. కర్నూలు జిల్లాలో పని చేసుకునేందుకు వచ్చానని, లాక్ డౌన్  కారణంగా తన ఇంట్లో వాళ్లు బయటకెళ్లి పనులు చేయలేని పరిస్థితి రావడంతో తినేందుకు తిండి కూడా లేదంటూ ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం, కర్నూలు జిల్లా  పార్లమెంటేరియన్స్ దృష్టి సారించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.




More Telugu News