Kerala: కేరళలో కరోనాతో తొలి మరణం

  • 69 ఏళ్ల వ్యక్తి మృతి
  • కొచ్చి మెడికల్‌ కాలేజీలో ఘటన
  • కేరళలో 176 కేసులు
  • మహారాష్ట్రలో మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ 
This is the first death in Kerala due to Coronavirus

కేరళలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. 69 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో కొచ్చి మెడికల్‌ కాలేజీలో చేరి చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించాడని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా.ఎన్‌కే కుట్టప్పన్ ప్రకటించారు. కాగా, కేరళలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 176 కేసులు నమోదు కాగా 163 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు కరోనా నుంచి 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కేరళ తర్వాత మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.  మహారాష్ట్రలో మొత్తం 162 మందికి కరోనా సోకింది. ఈ రోజు ఆరుగురికి నిర్ధారణయింది. ఆసుపత్రుల్లో133 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 25 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ రాష్ట్రంలో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News