Kerala: ఆల్కహాల్ వాసన రావడంతో శానిటైజర్ ను తాగేసిన ఖైదీ.. మృతి!

  • కేరళలోని పాలక్కాడ్ లో ఘటన
  • జైలులోనే తయారైన శానిటైజర్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Kerala Jail Inmate Died after drink Sanitiser

జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్ లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్ ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ శానిటైజర్ ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News