PV Sindhu: తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన పీవీ సింధు

  • దేశంలో లాక్ డౌన్
  • కరోనాపై తీవ్రంగా పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలు
  • విరాళం ఇస్తున్నట్టు ట్వీట్ చేసిన సింధు
PV Sindhu donates to Telugu states

కరోనాపై భారత్ ఆదిలోనే తీవ్రస్థాయి పోరాటం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో దేశం స్థంభించిపోయింది. ఈ క్రమంలో కరోనాపై పోరుకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్ లో వెల్లడించింది.

More Telugu News